నందిపేట్ జై భారత్ ఆగస్టు 12: (షేక్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం ఇంటి సామానులు మొత్తం కాలిపోయాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.విషాదకర ఈ సంఘటనలో బాధితులకు జమాత్ ఏ ఇస్లామి హింద్ నందిపేట్ శాఖ బాధ్యులు ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో రూ.5,000 సహాయం మంగళవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో జమా మస్జీదు అధ్యక్షుడు నసీరుద్దీన్, జమాత్ సభ్యులు బారి, మహబూబ్, కలీం, అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు.సహాయం అందించినందుకు బాధిత కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
నందిపేట్లో అగ్ని ప్రమాదం – జమాత్ ఏ ఇస్లామి హింద్ అండ.
Published On: August 12, 2025 9:20 pm











