తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 6 .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నుమ రేటర్లకు సర్వే కిట్లను అందచేసిన మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వేను ఎలాంటి తప్పులు దొర్లకుండా పక్కడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనారిటీ కార్యదర్శి యండి. దావూద్, నాయకులు నార్ల ఉదయ్, లింగం, రమేష్, ఎన్నుమ రేటర్లు మంద ప్రవీణ్ కుమార్, సంతోష్ కుమార్, అక్బర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.