జరిమానా 5,80,000/- విధించిన సంబంధిత కోర్టులు పోలీస్ కమిషనర్ వెల్లడి.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 17 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా ఒక వాారం లో వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 99 కేసుల నమోదు చేయడం జరిగింది.విరినందర్నీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ 99 మందికి కోర్టు లో హాజరు పరచగా వీరికి రూ: 5,80,000/- జరిమానా విధించడం జరిగింది.ఇందులో 3 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, తెలియజేయడం జరిగింది.ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు.వాహనా దారులు వాహనానికి సంబంధించి నటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకో గలరనీ నిజామాబాద్ కమిషనర్ తెలిపారు.









