ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : ఆర్మూర్ డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం లో సీసీ రోడ్డు పనులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈసందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తో మంజూరైనా సీఆర్ఆర్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించమన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, సుద్ద చిన్నయ్య రాజు, మున్నా పాల్గొన్నారు.
సీసీ రోడ్ల పనులు ప్రారంభం.
Published On: November 2, 2025 10:35 pm











