నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద 240 సైలెన్సర్లు ధ్వంసం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.(మహమ్మద్ పైసల్ ఖాన్)

నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లను ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైకర్లపై పోలీసులు కన్నెర్ర చేశారు. వాహనాల సైలెన్సర్లను తీసివేయించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 240 సైలెన్సర్లను నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనదారులతోపాటు షోరూమ్ నిర్వాహకులు, మెకానిక్ లపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!