నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 28.
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పన్ను బకాయిలున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు వెంటనే బకాయిలను చెల్లించాలని, లేని యెడల కఠిన చర్యలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ హెచ్చరించారు. జిల్లా కేంద్రం లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పన్ను వసూళ్లలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు . ఈ సందర్భంగా ట్రేడ్ లైసెన్స్ మరియు ప్రాపర్టీ టాక్స్ బకాయిలను పరిశీలించి, పన్ను చెల్లించని సంస్థలపై చర్యలు చేపట్టారు.నగర అభివృద్ధికి పన్నుల చెల్లింపులు అత్యవసరమని, అందుకు ప్రతి వ్యాపారస్తుడు సహకరించాలని కమిషనర్ కోరారు.










