థాయిలాండ్-మయన్మార్ చిక్కుకున్న తెలుగు యువతకు విముక్తి

కేంద్ర విదేశాంగ శాఖ సమర్థ చర్యలు-297 మంది తెలుగు యువత రక్షణ

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : థాయిలాండ్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లోని టాచిలేక్, ప్వే కొక్కో మయావాడీ ప్రాంతాలకు తెలుగు యువతను నకిలీ ఉద్యోగ ఆఫర్లతో మోసం చేసి, సైబర్ నేరాలకు బలవంతంగా పనిచేయిస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని ఎంపీ అరవింద్ ధర్మపురి లోక్ సభ రూల్ 377 కింద ప్రస్తావించగా, దీనిపై విదేశాంగ శాఖ సమగ్రంగా స్పందించింది. 2,545 మంది భారతీయులు అక్రమంగా తరలింపు విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, ఈ ఘటనల్లో మొత్తం 2,545 మంది భారతీయులు అక్రమంగా తరలించ బడినట్లు గుర్తించారు.2,390 మంది భారతీయులకు విముక్తి..భారత రాయబార కార్యాలయాలు (థాయిలాండ్,మయన్మార్) చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటి వరకు2,390 మంది భారతీయులను విజయవంతంగా రక్షించారు. ఈ ఘటనల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 316 మంది బాధితులుగా గుర్తింపు కాగా అందులో 297 మంది ఇప్పటికే సురక్షితంగా రక్షించబడ్డారు.

భారతీయుల భద్రతకు కేంద్రం అత్యున్నత ప్రాధాన్యత.

విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment