నిజామాబాద్ జై భారత్ జూన్ 30 : ముగ్పాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన కే.పోచయ్య కు సోమవారం పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.ఈ వీడ్కోళ్ల సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) బస్వారెడ్డి , నిజామాబాదు సౌత్ రూరల్ CI సురేష్ కుమార్, ముగ్పాల్ SI సి. యాదగిరి గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ తిరుపతి ( వెల్ఫేర్ ) శ్రీనివాస్ ( అడ్మిన్ ) , మరియు వారి కుటుంబ సభ్యులు హజరు కావడం జరిగింది.
పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం
Published On: June 30, 2025 6:00 pm
