తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 27.
నేడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తూ సెలవు ప్రకటించింది. అలాగే వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల్లో పేర్కొన్నారు