తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణిని, సొంత తమ్ము డు ప్రసాద్,దారుణంగా హత్య చేశాడు .పోలీసుల కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాగమణి ఇటీవల కులాంతర వివాహం చేసుకుందని, కానిస్టేబుల్ నాగమణి కుటుంబ సభ్యులు ఆమెపై చాలా రోజుల నుండి ఆగ్రహంతో ఉన్నారు సమయం కోసం వేచి చూచిన తమ్ముడు ఈరోజు ఉదయం బైకుపై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ, రోడ్డు మార్గంలో కారుతో ఢీ కొట్టి అనంతరం కత్తితో మెడపై నరికి హత మార్చాడు..ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనీ పేర్కొన్నారు.