తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28.
మెదక్ జిల్లా చేగుంట లో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ జి ఓ కాలనీవాసులకు ఉన్న రోడ్డును దౌర్జన్యంగా కబ్జా చేసి కాలనివాసులకు తమ వాహనాలను రాక పోకలకు ఇబ్బంది దుస్థితి ఏర్పడింది అని కాలనీ వాసులు తెలిపారు . వివరాలు ఇలా ఉన్నాయి,చేగుంట లో ఎన్ జి ఓ కాలనీ కి వెల్లే రోడ్డును దౌర్జన్యంగా ఒక వ్యాపారవేత్త లోకల్ లీడర్ల అండదండతో ఆక్రమించి మోరి పై అక్రమ నిర్మాణం ఇటీవల ఏర్పాటు చేశారు., ఇట్టి విషయం పై కాలనీ వాసులు పంచాయతీ ఈ ఓ (పంచాయతీ సెక్రటరీ ) కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.పంచాయతీ సెక్రటరీ నరేష్ (ఈ ఓ )వివరణ కోరగా , గత పంచాయతీ ఈవోగా పనిచేసిన అధికారి అట్టి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను దీని పైన ఎన్ జి ఓ కాలనీ వాసులు పిర్యాదు చేశారు, దీని పై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చాడు