జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మే 02 : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శనివారం సందర్శించారు. సాధారణ తనిఖీలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈవీఎం గోడౌన్ సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్
Published On: May 2, 2026 11:51 pm









