హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రైతు కార్మిక పార్టీ వ్యవస్థాపకుడు బాదావత్ భగవాన్ నాయక్ కిడ్నీ మార్పిడి కోసం ఆర్థిక సహాయం చేయాలని ప్రజలను కోరారు. ఆయన రెండు కిడ్నీలు విఫలమవడంతో డయాలసిస్ చేయించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కిడ్నీ మార్పిడికి భారీగా ఖర్చవుతుండటంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రైతు కార్మిక పార్టీ వ్యవస్థాపకుడు బాదావత్ భగవాన్ నాయక్ కిడ్నీ మార్పిడి కోసం ఆర్థిక సహాయం చేయాలని ప్రజలను కోరారు. 2001లో తెలంగాణ రైతు కార్మిక పార్టీని స్థాపించిన భగవాన్ నాయక్, 2005 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాల్లో, ర్యాలీల్లో, నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు. తెలంగాణ సాధన కోసం మూడుసార్లు ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, ఉద్యమ కాలంలోనే ఆయన సొంత ఇల్లు వ్యక్తిగతంగా 50 కోట్లకు పైగా నష్టపోయినా మొక్కవోని దీక్షతో, ధైర్యంగా ఉద్యమంలో పాల్గొన్నారు.
వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా సేవలు
భగవాన్ నాయక్ 1995 నుంచి 2004 వరకు సిరికొండ మండలం తుంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
ఆరోగ్య పరిస్థితి, వైద్య ఖర్చులు
ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో 2021లో ఈ విషయం నిర్ధారణ అయింది. అప్పటినుండి ఇప్పటివరకు రోజు ఒకసారి డయాలసిస్ చేయించుకుంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిడ్నీ మార్పిడి అవసరం ఉండటంతో నిమ్స్ ఆస్పత్రిలో జీవనాధార పథకం ద్వారా అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని, కానీ వారు ఐదు సంవత్సరాల వరకు వెయిటింగ్ లో ఉందని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అడిగితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి
ఆపరేషన్ చేయించుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడంతో, కిడ్నీ దాతలు ముందుకు రావాలని, సాధ్యమైనంత మద్దతు అందించాలని విలేకరుల సమావేశం ద్వారా ప్రజలను కోరారు. ఆయన ఫోన్ పే నెంబర్ 93965 27330, అకౌంట్ నెంబర్ 306 7787 1689, ఐఎఫ్ఎస్సి కోడ్ 0009789. ఆర్థిక సహాయం చేయాలని ఆయన కోరారు.











