నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16.
జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్.
సూపరింటెండెంట్ గా తొలి రోజు గురువారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ప్రధానంగా ఓపీ, ఎక్స్ రే, స్కానింగ్, అనాథ రోగుల విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మొదటి ప్రాధాన్యత రోగులకు ఉత్తమ సేవలందించడమేననీ అన్నారు. ఆస్పత్రి తనఖి లో భాగంగా డాక్టర్ జలగం తిరుపతిరావు, ఆయా విభాగాల అధికారులు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.