నిజామాబాద్ ప్రతినిధి జై భరత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20
వక్ఫ్ బోర్డు చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు.
నిజామాబాద్ లో వేలాది ముస్లింలతో వక్ఫ్ బచావో ర్యాలీ.
వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం. ఇది ముస్లిం మైనారిటీల హక్కులపై కేంద్రం చేస్తున్న కుట్ర. వక్ఫ్ ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేయడం చట్ట విరుద్ధం. మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. చట్టబద్ధంగా ఈ బిల్లును నిలిపివేయిస్తాం,” అన్నారు.వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిజామాబాద్ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు జరిగిన ఈ వక్ఫ్ బచావో ర్యాలీ శైలజా గ్రౌండ్ నుండి ఖిల్లా రోడ్ దాకా సాగింది. వేలాదిమంది ముస్లింలు పాల్గొనగా, విభిన్న మతపరమైన సంఘాలు, యువత, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీలో పాల్గొన్నవారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలంటూ పలువురు నేతలు మాట్లాడారు.
వక్ఫ్ బిల్పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం.