నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.
ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టులలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.భూమి తగాదాలు, చెక్ బౌన్స్, బ్యాంక్ లీగల్ యాక్షన్ రుణాలకు సంబంధించి మైంటనేన్స్ తదితర కేసులు పరిష్కరించబడతాయని అన్నారు. అదేవిధంగా కొందరు వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ఉండి ఇక్కడికి వచ్చే అవకాశం లేని వారికి లోక్ అదాలత్ ద్వారా వారికి వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అలాంటివారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఇరుపక్షాల వారు రాజీ ఉన్నప్పుడే రాజీ మార్గం సులువు అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను సంబంధించి నష్ట పరిహారం కోసం వేసిన కేసులలోని బాధితులు న్యాయ సేవా సంస్థను ఆశ్రయించితే ఒక నెల రోజుల వ్యవధిలో పూర్తి మొత్తం లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కేసులో కూడా న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే వారికి కూడా జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. 3నెలల ఒక సారి వచ్చి జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలనీ,ఈ అవకాశాన్ని కేసులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు వినియోగించుకోవాలాన్నారు. ఈ సమావేశంలో న్యాయా సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, కోర్టు సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.