నిజామాబాద్ జై భారత్ జూన్ 11: తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బంది నేడు నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, IPS.ను కలిసి పువ్వులమొక్క ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారూ.ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన ASI లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.