నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30.
కేసీఆర్ పాలనలో గత పదేండ్లు రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా చూసుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇప్పటివరకు రైతులకు రైతు బందు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. రైతు కూలీలకు కూడా సాయం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఏం సహాయం చేయలేదని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని,రాష్ట్రంలో ప్రతీ మూడు గంటలకు మహిళలపై ఒక అత్యాచారం జరుగుతోందని తెలిపారు.ప్రతీ ఐదు గంటలకు ఒక మహిళా కిడ్నాప్ అవుతోందని,మహిళా భద్రత కోసం కేసీఆర్ షీటీమ్స్ ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరగడం తప్పా ఏం చేయడం లేదని అన్నారు. కేసీఆర్ హయాంలో పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతోందని వాపోయారు.రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకపోవడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగమంటూ తిరుగుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనట్లు రెండు పెద్ద ఎన్ కౌంటర్లు జరిగాయి తుపాకి మోతలు ఉండవద్దన్న లక్ష్యంతో పరిపాలన చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. అలాంటిది ఇవాళ రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు భగ్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు మాత్రం విడుదల చేసిందని తెలిపారు. రైతులను నరకయాతన పెట్టడానికి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం రీసర్వే చేసే ముందు భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూముల రీసర్వే పేరిట ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద రాయన్న నమ్మకం ప్రజలకు, రైతులకు లేదు కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ వే అని తెలిపారు. నిజామాబాద్ జిల్లా అనాథగా మారింది. జిల్లా నుంచి కనీసం ఒక మంత్రి కూడా లేరని, ఎంపీ ఉన్నా లేనట్లే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు పవర్ లేదని అన్నారు.ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారని, నిజామాబాద్ కు ఆరు నెలల నుంచి పోలీసు కమిషనర్ లేకపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఏడాదికాలంలో ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు ఇవ్వలేదు కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక కొత్త పని చేపట్టలేదు అని ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు మేడిగడ్డ విషయంలో కేసీఆర్ ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో ఎస్సారెస్పీని ఎండబెట్టారు అని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. షబ్బీర్ అలీకి నిజామాబాద్ పై ఆలోచన లేదు, పట్టింపు లేదని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దందా జరుగుతోందని, ఇప్పుడు మైనింగ్ శాఖ ఆదాయం తగ్గిందని, కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరిగిందని అన్నారు.
ఇసుకు దోపిడీని అడ్డుకుంటాం మని అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 3 లక్షల 79 మంది బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 2 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది నిజామాబాద్ జిల్లాలో ఇంకా లక్షా 2 వేల మందికి, కామారెడ్ది జిల్లాలో 75 వేల మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేడు, తక్షణమే నిధులు విడుదల చేసి వర్సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కమిటీలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్ లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణం ని అన్నారు. బుల్డోజర్ తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే మేము ఊరుకోబోం అని స్పష్టం చేశారు.