నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : అందాపూర్ చిన్నమావంది గ్రామాల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, అందాపూర్ గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మాత్తుగా దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.6,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. చిన్నమావంది గ్రామ శివారులో మరో పేకాట స్థావరంపై రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేసి రూ.5,000 నగదును పోలీసులు స్వాధీనం చేసున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు.
పేకాట స్థావరాలపై దాడులు ఎనిమిది మంది అరెస్ట్ నగదు స్వాధీనం
Published On: October 20, 2025 11:00 am









