బోధన్ మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : (నవీన్ కుమార్) బోధన్ పట్టణ మున్సి పాలిటీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు నంబర్లు 1 నుంచి 38 వరకు ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ గురువారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. అనంతరం వచ్చిన అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో టీపీవో, మేనేజర్, టీపీబీవో, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లుతో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment