జిల్లా పాలనాధికారిని కలిసిన కమిషనర్ పి.సాయి చైతన్య

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10 :
నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన సీ.పీని కలెక్టర్ స్వాగతిస్తూ, అభినందనలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్, మరియు సీ.పీ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!