నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22
ఇందూరు తిరుమలలో జరిగే స్వామివారి కల్యాణానికి హాజరు
నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమల వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈవిషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.