తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్
హైదరాబాద్ . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్ లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, మరియు అధికారులతో సమీక్షించడం జరిగినది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ . తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఎక్బాల్, జీ.ఏ.డి డైరెక్టర్ ఎస్. వెంకట్రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ, మాజీ ఎమ్మెల్యే క్రిస్టైన్ లాజరస్, మేనేజింగ్ డైరెక్టర్ సబిత పాల్గొన్నారు.