డిప్యూటీ అధికారికి వినతి పత్రం అందజేసిన గ్రామ పరిరక్షణ కమిటీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 :

 భూ కబ్జా దారులు ఏక్కడ చూసిన ప్రభుత్వ భూములను వదలడం లేదు  దీనికి తోడు అధికారులు కుమ్మక్కై పట్టాలు చేయడం రిజిస్ట్రేషన్ పత్రాలను జారీ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇందుకు భూ కబ్జాకోరులు కబ్జాలకు గురి చేస్తున్నారు . ఇటీవల ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ కాలువ భూమి కబ్జాకు గురైన విషయంపై బాల్కొండ ఇరిగేషన్ డిప్యూటీ అధికారికి వినతిపత్రం అందజేశారు .వినతి పత్రం ద్వారా  సమస్యను తెలియపరిచిన ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో గ్రామపరిరక్షణ సమితి కార్యదర్శి సంజీవ్ థామస్, సభ్యులు టి.సాయన్న, కట్ట మహేష్, గద్దల గంగారాం, జక్కుల రాము, నేర బాబూరావు, కందుల శంకర్, కంచు గంగాధర్, బోట్ల భూమన్న, అనికేశి నడ్పి రాజన్న, రాకేష్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!