తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3.
యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్
జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న యాదవులను చైతన్య పరిచి ప్రభుత్వ పరంగా సంఘాల పరంగా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులను సాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గనవేని మల్లేష్ యాదవ్ ,జిల్లా కార్యవర్గ సభ్యుడు చిర్రం ప్రకాష్ యాదవ్ లక్ష్మి నారాయణ యాదవ్ అన్నారు..
కొడిమ్యాల మండలంలోని 1. నల్లగొండ మరియు 2. తిప్పయ్య పల్లె గ్రామాలలో యాదవ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి యాదవుల సమస్యల పరిష్కారం,ఐక్యత,సభ్యత్వ నమోదు గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది..