జై భారత్ దినపత్రిక నందిపేట్ జనవరి 07 : (షేక్ గౌస్) నందిపేట మండల సర్పంచుల ఫోరం కార్యవర్గ ఎన్నిక బుధవారం ఘనంగా జరిగింది. ఎన్నికల్లో అధ్యక్షుడిగా నందిపేట సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉపాధ్యక్షులుగా మిసాల లక్ష్మీనారాయణ (అయిలాపూర్), బాగరి జీవన్ (మాయపూర్) ఎన్నికయ్యారు.కార్యదర్శిగా మంగళారపు సుప్రియ (ఖుదాన్పూర్), జాయింట్ సెక్రటరీగా గోపు ముత్వం (బజార్ కొత్తూర్) ఎంపికయ్యారు. కోశాధికారిగా వట్టిగుంట సుష్మా రామకృష్ణ (ఆంధ్రానగర్), అధికార ప్రతినిధిగా రోజ్జి దేవేందర్ (వెల్మల్) మరియు సలహారుగా బొల్లాపల్లి సంతోష్ గౌడ్ (లక్కంపల్లి) ఎన్నికయ్యారు.సర్పంచులందరూ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గానికి మద్దతు తెలిపారు.
మండల సర్పంచుల ఫోరం కార్యవర్గ ఎన్నిక
Published On: January 7, 2026 9:06 pm











