బాన్సువాడ జై భారత్ జూలై 30 : ఆగస్టు 4న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క నియోజకవర్గానికి రానున్నట్లను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రా మండల కేంద్రాలలో మండల సముదాయ భవనాలు, మోస్రా లో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్ గ్రామపంచాయతీ భవనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను చందూర్, మోస్రా మండలాల సంబంధిత అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆగస్టు 4న ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క రాక.
Published On: July 30, 2025 11:40 pm









