ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 21 ( షేక్ గౌస్)
నిజామాబాద్, ప్రతినిధి: మాక్లూర్ మండలంలోని గొత్తుముకుల గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగమోహన్‌ను రూ.18,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ఫిర్యాదుదారునికి హౌస్ నంబర్, అసెస్మెంట్ నంబర్ కేటాయించేందుకు నిబంధనలు ఉల్లంఘిస్తూ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.ముందుగా రూ.20,000 డిమాండ్ చేసిన కార్యదర్శి, ఆ తర్వాత రూ.18,000కి తగ్గించాడు. ఈ మొత్తాన్ని తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాడు.తన ఉద్యోగాధికారాలను దుర్వినియోగం చేస్తూ అక్రమ లాభం కోసం లంచం తీసుకున్న ఆయనను అరెస్ట్ చేసి, నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

లంచం డిమాండ్ చేసే అధికారులపై సమాచారం ఇవ్వాలనుకునేవారు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయవచ్చు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్‌(@TelanganaACB) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ హామీ ఇచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!