తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యసభ లో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. ఇళయరాజా స్పందిస్తూ.. ఇది నా జీవితంలో మరపురాని సమావేశం అని పేర్కొన్నారు.వీరి భేటీపై ప్రధాని మోదీ ‘ఎక్స్’లో స్పందించారు. రాజ్యసభ ఎంపీ ఇళయరాజని కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఇటీవల లండన్లో పాశ్చాత్య శాస్త్రీయ సింఫనీ వాలియంట్ ను ప్రదర్శించడం ద్వారా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.