నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ సిబ్బందితో ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.